Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Monday, August 28, 2017

Mana Kamareddy

ప్రశ్నించడం నేర్చుకుందాం, ఆలోచించడం నేర్చుకుందాం..


మన దేశంలో బాబాలు, ఫకీర్లు, ఇవాంజెలిస్ట్‌లు ఏమి చెయ్యరు. లోక కళ్యాణానికే వారు పాటు పడతారు. అంతే తప్ప సమాజానికి వారి వల్ల, మా నమ్మకాల వల్ల ఎటువంటి హాని లేదు అనే వారికి, ఇదే వాస్తవ చిత్రం.

ఒక రేప్ జరిగితే, 'మేమున్నాం!' అని అన్ని రాష్ట్రాలు కలిసి వచ్చిన దేశంలో, ఒక రేపిస్ట్‌ని 'నువ్వు రేప్ చేసావు, నీ నేరం రుజువయ్యింది' అని కోర్టు తేలిస్తే...లక్షల్లో వాని శాంతి దూతలు గోల  (ఆధ్యాత్మిక శిఖామణులు), 6 రాష్ట్రాల్లో హింస, రక్తపాతం, 11 జిల్లాల్లో కర్ఫ్యూ , 27 రైళ్లు దగ్ధం, 31 మంది చావు అలాగే  300 మందికి గాయాలు.. మొత్తానికి 400 కోట్ల ప్రజా ధనం నాశనం.

ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి??
ప్రజలు ఇంతగా ఆలోచించలేని స్థాయికి దిగజారడానికి కారణం ఏంటి??

సమాజపు కానిస కామన్ సెన్స్ ని నాశనం చేసే స్థాయికి వీళ్ళు ఎదుగుతున్నారు!
పక్క దేశాల్లో నవ్వుల పాలవుతున్న మ్యాజిక్ ట్రిక్స్ ని మన దేశంలో ఇంకా మహిమగా చెలామణి చేస్తున్నారు!!
అందుకే ప్రజలందరికి సైంటిఫిక్ టెంపర్ ని అలవాటు చెయ్యాలి.

ప్రశ్నించడం నేర్చుకుందాం. 
ఆలోచించడం నేర్చుకుందాం..

మనది గొర్రెల మందలు ఉన్న దేశం కాదు,  ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించిన మొదటి దేశం అని చాటి చెబుదాం. భారతదేశ పరువును కాపాడుదాం..
- మన కామారెడ్డి


Subscribe to this Mana Kamareddy Portal via Email :