తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, రంజాన్ సందర్బంగా ఈ నెల 8న హైదరాబాద్ నిజాం కాలేజి గ్రౌండ్స్ లో ముస్లిం సోదరులకు దావత్-ఎ-ఇఫ్తార్ ఇవ్వబోతుంది. హైదరాబాద్ నగర మసీదుల్లో సుమారు వెయ్యి మందితో జరిగే దావత్-ఎ-ఇఫ్తార్ కి టర్కీ, ఇరాన్, సౌదీ, ఇండోనేషియా నుండి అంబాసిడర్లను ఆహ్వానిస్తున్నారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలోని ఒక మసీదులో ఇఫ్తార్ విందు ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి తోడు 1 లక్షా 95 వేల మంది పేద ముస్లింలకు రూ.500 బట్టలు, ఇమామ్ లకు నెలకు వెయ్యి భృతిని కూడా కేసీఆర్ ప్రకటించారు.