ఆయన ఓ మాజీ సర్పంచ్. తన ఐదేళ్ల పదవీకాలంలో ఎంతగానో నీతి, నిజాయితీగా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేశారు. ఎవరు, ఎప్పుడు, ఏ పని కోసం వచ్చినా.. తన సొంత ఖర్చులతో చేసిపెట్టారు. ఎవరి వద్దనుంచీ నయాపైసా కూడా ఆశించలేదు.కానీ చివరికి ప్రజ సేవలో తన ఆస్తి అంత పోయింది. ఒకప్పుడు తన కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూసేవారు. కానీ, ఇప్పుడు తానే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వృద్ధాప్య ఫించన్ కోసం తిరిగి తిరిగి చివరికి ప్రభుత్వ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకున్నాడు.
నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామానికి చెందిన పైడి నర్సింహారెడ్డి(65) నిజాయితికి మారు పేరు. ఆయన ముందుగా ఉపసర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు ఆ సమయంలోనే ఊరిలో మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత ప్రజలందరి సహాయంతో సర్పంచ్గా ఎన్నికైయ్యాడు, ప్రజలకు ఏ కష్టం వచ్చిన అందరు అతని గడప ముందు వాలిపోయేవారు తను కూడా లేదనకుంట వచ్చిన వారికి సాహాయం చేసేవాడు. అలా అడిగిన వారికి కాదనకుండ ఇవ్వడం, కాలంతో పాటు తన 5సంవత్సరాల పదవి కాలంలోనే తన 20ఎకరాల ఆస్తి కరిగిపోయింది. ఆస్తులన్నీ కరిగిపోవడంతో బతుకుదెరువు కోసం కొన్నేళ్లు విజయవాడ, హైదరాబాద్లలో ప్రైవేటు కంపెనీల్లో పనిచేశారు. వారు ఇచ్చే జీతం చాలక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. చివరికి మళ్లీ తన సొంత గ్రామానికి చేరుకున్నారు. పింఛన్ కోసం ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరిగారు. అయినా వారు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన నర్సింహారెడ్డి గురువారం రాత్రి ఎంపీడీవో కార్యాలయం వద్దే పురుగుల మందు తాగి తనువు చాలించాడు.
నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామానికి చెందిన పైడి నర్సింహారెడ్డి(65) నిజాయితికి మారు పేరు. ఆయన ముందుగా ఉపసర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు ఆ సమయంలోనే ఊరిలో మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత ప్రజలందరి సహాయంతో సర్పంచ్గా ఎన్నికైయ్యాడు, ప్రజలకు ఏ కష్టం వచ్చిన అందరు అతని గడప ముందు వాలిపోయేవారు తను కూడా లేదనకుంట వచ్చిన వారికి సాహాయం చేసేవాడు. అలా అడిగిన వారికి కాదనకుండ ఇవ్వడం, కాలంతో పాటు తన 5సంవత్సరాల పదవి కాలంలోనే తన 20ఎకరాల ఆస్తి కరిగిపోయింది. ఆస్తులన్నీ కరిగిపోవడంతో బతుకుదెరువు కోసం కొన్నేళ్లు విజయవాడ, హైదరాబాద్లలో ప్రైవేటు కంపెనీల్లో పనిచేశారు. వారు ఇచ్చే జీతం చాలక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. చివరికి మళ్లీ తన సొంత గ్రామానికి చేరుకున్నారు. పింఛన్ కోసం ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరిగారు. అయినా వారు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన నర్సింహారెడ్డి గురువారం రాత్రి ఎంపీడీవో కార్యాలయం వద్దే పురుగుల మందు తాగి తనువు చాలించాడు.