వారం రోజుల క్రితం హైదరాబాద్ పంజాగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేష్ అనే సాఫ్ట్వెర్ ఇంజనీర్ మరియు ప్రమాదం జరిగిన కొన్ని రోజులకు అతని అన్న కూతురు చిన్నారి రమ్య కూడా మరణించిన విషయం తెలిసిందే. రాజేష్ తన ఫామిలీ మెంబెర్స్ తో ప్రయాణిస్తున్న కారును తాగి నడుపుతున్న ఆరుగురు మైనర్ కుర్రాళ్ల కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిన రాజేష్ గారి సతీమణి శిల్ప, తన ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఒక టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె లేవనెత్తిన ప్రతి అంశం అనగా పోలీసుల గురించి, ట్రాఫిక్ పోలీసుల గురించి, డాక్టర్లను మరియు తల్లి దండ్రులను, బార్ షాపుల వాళ్ళను, ప్రభుత్వాన్ని , ప్రైవేట్ స్కూళ్లను అలా ఒకటికాదు అనేక అంశాలపై శిల్ప గారు మాట్లాడిన తీరు సమాజంలో ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి. ఒక్కసారి ఈ వీడియో చూడండి...