
రిలయన్స్ జియో ఇస్తున్న ఫ్రీ ఆఫర్లకి ఇతర మొబైల్ నెట్ వర్కులన్నీ బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జియోకే షాకిచ్చింది టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్). ఇది వరకు మిగితా నెట్వర్క్ల విషయంలో నిమిషానికి రూ. 1.20 వాయిస్ టారిఫ్ అమలులో ఉండగా, ఉచిత కాల్స్ ఆఫర్ ఎలా ఇస్తారంటూ నోటీసులిచ్చిండి. రెగ్యులేటరీకి సమర్పించిన రిపోర్టుకు, ప్రస్తుతం ప్రకటించిన ఆఫర్లకు చాలా తేడా ఉన్న కారణంగా జియోను వివరణ కోరింది ట్రాయ్. ఇప్పటికే ట్రాయ్ ఉన్నతాధికారులు రిలయన్స్ జియో ప్రతినిధులతో భేటీ అయి, టారిఫ్ ప్లాన్ వివరాలు, ప్రైసింగ్ మోడల్ తదితరాలపై వివరాలు తెలుసుకుంటున్నారని వివరించాయి. కాగా, కాల్ ప్లాన్ కింద సెకనుకు 2 పైసలు చార్జ్ చేస్తామని రెగ్యులేటరీకి తెలిపిన జియో, సిమ్ కార్డు బ్రోచర్లపైన ఇదివరకే ఈ అంశాన్ని ప్రచురించింది. ఇక ఉచిత కాల్స్ ఆఫర్ కు, ఈ టారిఫ్ ప్లాన్ కు మధ్య వ్యత్యాసంపై సంస్థ ఇప్పటివరకూ స్పందించలేదు. అలాగే భవిష్యత్తులో కూడా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.