భారత్ - ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య బలమైన మిలిటరీ సంబంధాలు ఉన్నాయి. ఇండియా ఎవరినీ నమ్మినా నమ్మకపోయినా.. ఇజ్రాయెల్ ను మాత్రం పక్కాగా నమ్ముతుంది అలాగే భారత్ ఆంటే ఇజ్రాయెల్ కు ఎనలేని ఇష్టం ఎందుకంటే దానికి కారణం లేకపోలేదు ఇజ్రాయిల్ లో యూదులు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఆనాడు యూదులకు భారత్ ఆశ్రయం ఇవ్వటం వల్ల వారంతా ఒక దేశంగా ఏర్పడిన తరువాత భారత్ మీద ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. ఇజ్రాయిలీ పౌరుడు జీవితంలో ఒక్క సారైనా భారత్ ను సందర్శించాలని కలలు కంటాడు. అందుకే భారత్ అంటే ఇజ్రాయిల్ కు ఎనలేని గౌరవం, అభిమానం.
ఇజ్రాయిల్ భారత్ నుంచి ఏమి ఆశించని గొప్ప మిత్ర దేశం. మిగతా దేశాలు రష్యా, అమెరికా తమ స్వార్ధ ప్రయోజనాలును చూసుకుంటుంది గాని నిజమైన మిత్ర దేశాలుగా మెలగవు. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి కూడా మోడీ బొమ్మతో ఎన్నికలకు వెళ్లాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇజ్రాయిల్ లో భారత్ దేశం మీద ఎంత ప్రేమ ఉందో !
ఇండియా జోలికొస్తే పాక్ తాట తీస్తాం: ఇజ్రాయెల్
కాశ్మీర్ విషయంలో పాక్ స్పదించిన తీరు, ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇజ్రాయిల్ కు కోపం తెప్పించాయి ఇండియా పక్షాన ఎవరు నిలబడినా నిలబడకపోయినా తాము నిలబడతామని, కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, భారత్ జోలికి వస్తే తాట తీస్తామని పాక్ ను హెచ్చరించింది.
ఒకవేళ పీఓకేలో ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత్ వెళ్తే తాము కూడా తమ సైన్యాన్ని తోడుగా పంపిస్తామని తేల్చి చెప్పింది.
భారత్ కు ప్రపంచ దేశాల మద్దతు రోజురోజుకు పెరగడంతో పాక్ లోలోపల తీవ్ర మదన పడుతుంది.
Read More